కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సైదానాయక్

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సైదానాయక్

గరిడేపల్లి ముద్ర:- గరిడేపల్లి మండలం గారకుంటతండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు, గరిడేపల్లి మాజీ సర్పంచ్ బాణోతు మంగతి సైదానాయక్ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పయిడిమర్రి రంగనాథ్, ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్ కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ బండ నర్సిరెడ్డి, నేరేడుచర్ల బ్లాక్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు రమేష్ నాయక్, సీనియర్ నాయకులు సురభి సైదులు, వెంకటరెడ్డి, రవీందర్ నాయక్, యువ నాయకులు జలేంధర్ నాయక్, దశరథ నాయక్, వీరేందర్ నాయక్, మోహన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.