నిత్యావసర సరుకుల పంపిని..

నిత్యావసర సరుకుల పంపిని..

వెల్గటూర్, ముద్ర :  సంక్షేమ శాఖ మంత్రి  కొప్పుల ఈశ్వర్, స్నేహలతల వివాహ వార్షికోత్సవాన్ని పురస్క రించుకొని  ఏఎంసి చైర్మన్ పత్తిపాక వెంకటేష్ వెల్గటూర్ మండలంలో  బీఆర్ఎస్ నాయకులతో  కలిసి శనివారం పలు రకాల సేవా కార్యక్రమా లను నిర్వహించారు. ఈ సందర్బంగా  మండలంలోని రాజక్కపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న  మర్రి పోచయ్యతో  పాటుగా పలువురికి  నిత్యవసర సరుకులను పంపిని చేశారు.  ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సురేష్, పత్తి పాక శ్రీనివాస్, తాటి నాగరాజు, గ్రామ శాఖ అధ్యక్షులు ఎర్రోళ్ల సతీష్,  మోత్కూరి శేఖర్,మర్రి పోచయ్య,పోతురాజుల చంద్రశేఖర్, లశెట్టి వెంకటేష్, పత్తిపాక కిషన్, వెంకటేష్, బొడ్డు రమేష్, ఎర్రోళ్ల నవీన్, సన్నీ, సైరా,ఆదిత్య  యూత్ సభ్యులు  పాల్గొన్నారు.