సీనియర్ విలేకరి మనోజ్ మృతి
![సీనియర్ విలేకరి మనోజ్ మృతి](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_642c386d3b9bf.jpg)
సైదాపూర్ ముద్ర: మండలంలో పలు పత్రిక లలో పని చేసి దశాబ్ద కలాంకు పైగా అనుభవం ఉన్న సీనియర్ విలేఖరి బోనగిరి మనోజ్ కుమార్ హఠాన్మరనం చెందారు. గ్రామస్థుల సమాచారం మేరకు మండలంలోని గొడిశాల గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ మంగళవారం ఉదయం వ్యవసాయ పనులకి వెల్లాడు.
పనులు చేస్తుండగానే ఒక్కసారిగా ఛాతి నొప్పితో బాధపడుతున్న విషయాన్ని గమనించి కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం హుజురాబాద్ హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు. కాగా మనోజ్ కుమార్ మృతి సమాచారంతో గ్రామంలో విషాదం అలుముకున్నధి. ఈ సమాచారం తెలుసుకున్న సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి గొడిషాలకు చేరుకున్నారు. మనోజ్ బౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దహనసంస్కార ఖర్చులకి రూ.ఐదు వేలు ఆర్థిక సహాయం చేశారు.