బీబీనగర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పాండు మృతి

బీబీనగర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పాండు మృతి

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: బీబీనగర్ మండలకేంద్రానికి చెందిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సీనియర్ నాయకుడు మీసాల పాండు ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. బీఆర్ఎస్ పార్టీలో చురుగ్గా వ్యవహరించడంతో పాటు మున్నూరు కాపు సంక్షేమ సంఘం మండలశాఖ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

ఆయన మృతదేహానికి  జడ్పీటీసీ సభ్యురాలు గోలి ప్రణీత, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పింగళ్ రెడ్డి, సర్పంచి మల్లగారి భాగ్యలక్ష్మి, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు, సుదర్శన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.