ఆర్కేపురం డివిజన్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్కు షాక్

ఆర్కేపురం డివిజన్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్కు షాక్
  • ఎన్టీఆర్ నగర్ బీఆర్ఎస్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు  బీజేపీలో చేరిక

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:-మహేశ్వరం నియోజక వర్గంలో లో బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ లకు చెందిన సీనియర్ నేతలు బీజేపీలో చేరారు. శుక్రవారంబి ఆర్ ఎస్  పార్టీ కి చెందిన ఆర్కేపురం పార్టీ మాజీ కౌన్సిలర్ డాక్యా నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు షకృ నాయక్.. బంజారాబస్తీకి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జగన్ నాయక్, రతన్ నాయక్, గోవింద్ నాయక్, హరి నాయక్ లు బీజేపీలో చేరారు. ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ సమక్షంలో  బి జె పి పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ అభ్యర్థి మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ - కాంగ్రెస్ కు స్థానం లేదని, రెండూ ఒకే గూటి పక్షులని ఎద్దేవా చేశారు.బీజేపీతోనే ఉచిత విద్యా, వైద్యం సద్యం అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ  కార్యవర్గ సభ్యులు ధీరజ్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ముంతా రాములు, సుదర్శన్, వెంకటరెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.