ప్రజలంతా ఒక్కటేనని వెలుగెత్తి చెప్పిన గొప్ప యోగి సేవాలాల్ మహరాజ్
- ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్
- ఆరాద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సేవాలాల్ జయంతి
తుంగతుర్తి ముద్ర:-గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ సంతు సేవాలాల్ జయంతి ఉత్సవాలను తుంగతుర్తి మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్లో ఆరాధ్య ఫౌండేషన్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జయపాల్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు .
ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు శ్రీకాంత్ రాజు మాట్లాడుతూకుల, మతాలను ప్రోత్సహించడం వల్లే అనేక ఇబ్బందులు వస్తాయని గ్రహించి సమాజంలో మనమంతా ఒక్కటే అన్న భావజాలాన్నివెలుగెత్తి చెప్పిన గొప్ప యోగి అని అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... సంత్ సేవాలాల్ మహా రాజ్ కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదని, అందరికీ ఆరాధ్యుడేనని అన్నారు. గిరిజనులకు దశ-దిశను చూపి, హైందవ ధర్మం గొప్పతనం, విశిష్టతలను తెలియ జేయడానికే సేవాలాల్ మహారాజ్ జన్మించారని చరిత్రకారులు చెబుతారని పేర్కొన్నారు.బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారని వెల్లడించారు.
దీంతో శ్రీ సంత్ సేవాలాల్ ఇతర కులాల వారికి కూడా ఆదర్శ మూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలని సూచించారు.సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఇంకెక్కడా జరపడం లేదంటే ఇది మన రాష్ట్ర గొప్పతనమని కొనియాడారు.సమావేశానికి ముందు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ సందర్భంగా ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ దంపతులు గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా యుద్ధ నౌక ప్రజా కవి, కళాకారుడు గిద్దే రామ నర్సయ్య తన ఆటపాటలతో కార్యక్రమాన్ని ఉర్రూతలూగించరు.ఈ వేడుకల్లో ఆరాద్య ఫౌండేషన్ ఫౌండర్ శ్రీకాంత్ రాజ్,మహారాష్ట్ర కోయిల్ ఘడ్ గిరిజన పూజారి రమేష్ మహారాజ్, వరంగల్ సీఐ కాన్సిరాం నాయక్, డాక్టర్ రమేష్ నాయక్, రామచంద్ర నాయక్,సొమ్ల నాయక్,అంబటి రాములు, రమేష్ నాయక్, రామ్ సింగ్ నాయక్, నాగేందర్ నాయక్, ఆరాధ్య ఫౌండేషన్ వివిధ మండలాల అద్యక్షులు,సభ్యులు, గిరిజన సంఘం నాయకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.