మహేందర్ రెడ్డి సమక్షంలో కారెక్కిన కాంగ్రెస్ నాయకులు
![మహేందర్ రెడ్డి సమక్షంలో కారెక్కిన కాంగ్రెస్ నాయకులు](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_652facd49442a.jpg)
ముద్ర, యాదగిరిగుట్ట:యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డి గూడెం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు 150 మంది టిఆర్ఎస్ పార్టీలో చేరారు.నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి వారికి బిఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాగపురి కిషన్, కుమ్ము సరితా శేఖర్, స్వర్గం నరహరి , బెదరబోయిన రవి, జంగిటి అడవయ్య, జోగు ఐలయ్య, మగ్గం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.