ఒక చోట భక్తి పారవశ్యంతో నృత్యం

ఒక చోట భక్తి పారవశ్యంతో నృత్యం
  • మరొక చోట సమస్యలపై అధికారులకు వాయింపు..
  • ఇంకో చోట క్యాలెండర్ అవిష్కరణలు...
  • ఇది స్థానిక ఎమ్మెల్యే కార్యక్రమాలు

ముద్ర, షాద్ నగర్:-ఎమ్మెల్యేగా నెలన్నర రోజులు పూర్తి చేసుకున్న షాద్ నగర్ ఎమ్మెల్యే కాసులబాద్ శంకరయ్య నిత్యం ప్రజల్లో ఉంటూ తమ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు.. సోమవారం అయోధ్య రామ మందిరం సందర్భంగా షాద్ నగర్ పట్టణం లోని చౌడమ్మ గుట్ట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ బజన కీర్తనలలో భాగంగా భక్తి పారవశ్యంతో నృత్యం ప్రజలను ఆకట్టుకున్నారు. అనంతరం ప్రజలు ప్రతిరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కరెంట్ సమస్యలపై తలుపులు బిగించి మరీ అధికారులను వాయించారు. మరో చోట క్యాలెండర్ ఆవిష్కరణ లు చేశారు..ఇలా వరుస సమీక్షలు,సమావేశాలు,కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యే కాసులబాద్ శంకరయ్య కాలంలోనే కొద్దికాలంలోనే ప్రజల మన్న‌నలు చూరగొంటున్నారు. ఇంతకుముందే షాద్నగర్ నియోజకవర్గం లో ప్రజల సమస్యలు తెలిసి ఉన్న శంకరయ్య 15 సంవత్సరాల క్రితం చేగురు నరసప్ప కూడా సమీపంలో రియల్ ఎస్టేట్లో జరిగిన అక్రమాలపై గొంతేత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ప్రజలు దృష్టిని ఆకర్షించారు.

షాద్నగర్ నియోజకవర్గం రిజర్వుడ్ నుండి జనరల్ గా మారినప్పటి నుండి ఎమ్మెల్యే పదవి కోసం ప్రయత్నిస్తూ ఈ విడత అదృష్టం దక్కించుకున్నారు. అదే సమయంలో కాస్లాబాద్ శంకరయ్యకు సామాజిక వర్గం నేపథ్యంలో మంత్రి వర్గంలో చోటు దక్కబోతున్నట్లు తెలుస్తోంది... అది కూడా త్వరలోనే జరగనున్నట్లు కార్మిక శాఖ వరించనున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో రిజర్వుడ్ గా ఉన్న సమయంలో మంత్రి శంకర్రావు బాధ్యతలు నిర్వహించగా ఇప్పుడు అదే పేరు ఉన్న శంకరయ్య అన్ని అనుకున్నట్లు జరిగితే మంత్రి పదవి చేపట్టడం ఖాయం. 15 నుండి 20 సంవత్సరాల మధ్య ఇంత కష్టపడి ఈ స్థాయికి చేరుకున్న శంకరయ్య ఇప్పుడు అనుకున్న అభివృద్ధి సాధిస్తారా లేదా వేచి చూడాల్సిందే..