శేఖర్ రెడ్డి గెలుపుకై 8వ వార్డ్ లో ప్రచారం
![శేఖర్ రెడ్డి గెలుపుకై 8వ వార్డ్ లో ప్రచారం](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_65311c510c5ca.jpg)
ముద్ర ప్రతినిధి భువనగిరి :భువనగిరి నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ గెలుపు కోసం భువనగిరి పట్టణంలోని 8వ వార్డ్ లో కౌన్సిలర్ పంగరేకుల స్వామి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్చార్జిలు ఇట్టబోయిన గోపాల్, నక్కల చిరంజీవి యాదవ్, తాడూరి అంజయ్య, మందడి జితేందర్ రెడ్డి, వార్డ్ అధ్యక్షులు కార్యదర్శులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తోమిదినర్ర సంవత్సరాలలో అనేక అభివృద్ధి పనులు, బిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, బిఆర్ఎస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టో కరపత్రాన్ని ఇస్తూ కార్ సింబల్ మీద ఓటు వేయాల్సిందిగా కోరారు.