మహిళా రక్షణకోసమే షి టీములు

మహిళా రక్షణకోసమే షి టీములు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం షీ టీములు ఏర్పాటు చేసిందని, అత్యవసర వేళల్లో వీటిని వినియోగించుకుని రక్షణ పొందవచ్చని షి టీమ్ ఎస్సై సుమాంజలి అన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో మంగళవారం అవగాహన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా షి టీం ఎస్సై సుమాంజలి మాట్లాడుతూ మహిళలకు అనుకొని విపత్కర పరిస్థితిలో ఎదురైనప్పుడు తమ బృందాలు ఆదుకుంటాయని అన్నారు అత్యవసర వేళల్లో తమ సహాయం పొందవచ్చని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో షి టీం సభ్యులు లింగయ్య, రమాదేవి, రాధిక తదితరులున్నారు.