బిజెపి నాయకుల శ్రమదానం

బిజెపి నాయకుల శ్రమదానం

రామకృష్ణాపూర్, ముద్ర: పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ముందు పెరిగిన పిచ్చి మొక్కలను బిజెపి నాయకులు గురువారం తొలగించారు. బిజెపి ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బంగారు ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొని మాట్లాడారు. పెరిగిన పిచ్చి మొక్కలతో విషసర్పాలు సంచరిస్తున్నాయని తెలపడంతో శ్రమదానం చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మహంకాళి శ్రీనివాస్, సీనియర్ నాయకులు అరుముళ్ల పోషం,వేముల అశోక్,ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పత్తి శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ,శ్యామ్,మల్లయ్య,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.