హోరా హోరీగా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలు
![హోరా హోరీగా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలు](https://mudranews.in/uploads/images/2023/01/image_750x_63d663e3c43e9.jpg)
ముగిసిన నామినేషన్ల పర్వం.. అధ్యక్ష బరిలో నలుగురు
ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలు హోరా హోరీగా కొనసాగనున్నాయి. రెండేళ్ల అనంతరం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయగా.. ఆదివారం నామినేషన్ల పర్వం ముగిసింది. ఫిభ్రవరి 1న సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరగనున్నాయి.
అధ్యక్ష స్థానానికి ఆకుల జయంత్, ఆకునూరి శంకర్, చిటికెన జగదీష్, ఆసరి మహేశ్, ఉపాధ్యక్షుడి స్థానానికి ఖాజా ఇస్మాత్ మోయిన్, రఘవీర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి స్థానానికి పర్కాల ప్రవీణ్, ఎంవీ.సుకుమార్, కార్యదర్శి స్థానానికి బైరి మధు, రాపల్లి భాస్కర్, కోశాధికారి స్థానానికి కాయితి మహేందర్, సిద్దుల మురళీ కార్యవర్గ సభ్యలుగా అన్సారీ అలీ హైమద్, రాజ రమేశ్ జక్కని, గంగు సతీష్, జంగిలి రాజు, వీరగోని చందు, బూర్ల వెంకటేశం, బైరి విఠల్, నాయిని బాబు, జాన దయానంద్, దాసరి శీరిష, అల్లె రమేశ్ లు నామీనేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామీనేషన్ల పరిశీలన, ఉపంసరహరణలు ఉంటాయని ఎన్నికల అధికారులు రాపల్లి సంతోష్, తడుక విశ్వానాథం, కరుణాల భద్రాచలం, ఇరుకుల్ల ప్రవీణ్, కిషన్ పేర్కొన్నారు.