తీవ్ర విషాదం....కాలువ‌లో ప‌డిన కారు… ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

తీవ్ర విషాదం....కాలువ‌లో ప‌డిన కారు… ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

ముద్ర,సెంట్రల్ డెస్క్:-కారు కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించిన విషాద ఘ‌ట‌న మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో మ‌రొకరు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబమంతా పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తాస్​గావ్​లోని రాజేంద్ర పాటిల్ కుటుంబం మంగళవారం కవ్​ఠేమంకాల్ గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు వెళ్లారు. తిరిగి వస్తుండగా తాస్​గావ్​ మనెరాజురీ మార్గంలోని చించాణీ సమీపంలో ఉన్న టకారి కెనాల్​లోకి కారు దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు మరణించారు.