నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:- నల్గొండ జిల్లా మిర్యాల గూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.గుర్తుతెలియని లారీ కారును వెనుక నుంచి ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరో మహిళ తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేశ్‌ (32) హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, ఇతర ప్రాంతాలకు దైవదర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి వస్తుండగా అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఓ లారీ  కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేష్ భార్య జ్యోతి (30), కుమార్తె రిషిత (6), మహేశ్‌ తోడల్లుడు, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నెపల్లికి చెందిన భూమా మహేందర్‌ (32), ఆయన కుమారుడు లియాన్సీ (2) అక్కడికక్కడే మృతి చెందారు.

మహేందర్‌ భార్య భూమా మాధవి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెకు మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించి తరువాత ప్రైవేటు ఆసుపత్రికి తరలించాగా మృతి చెందింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు నేత్రాలను వాసవి నేత్ర నిధి కి అందజేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు.ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణచేపట్టారు