ఢిల్లీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
![ఢిల్లీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి](https://mudranews.in/uploads/images/2024/06/image_750x_667bc1556a413.jpg)
ముద్ర,తెలంగాణ:-ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది. ఢిల్లీకి రావాలని సోనియా గాంధీ జీవన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ క్రమంలో ఆయన ఢిల్లీకి పయనం కానున్నారు. కాగా సంజయ్ కుమార్ చేరికపై జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
నా పదవికి రాజీనామా చేస్తా..
జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నా ప్రమేయం లేకుండా జరగాల్సింది జరిగిందని అన్నారు. పార్టీ మారే ఆలోచన లేదని.. కాంగ్రెస్ లోనే సోనాగుతానని స్పష్టం చేశారు. బీజేపీ నుంచి తనను ఎవరు సంప్రదించలేదని అన్నారు. కాగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ చేరుతున్నారని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.