రాజ్యసభ ఎంపీగా  సోనియా గాంధీ ప్రమాణస్వీకారం

రాజ్యసభ ఎంపీగా  సోనియా గాంధీ ప్రమాణస్వీకారం

ఇన్నాళ్లూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ  ఈ సారి లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. వయసు రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఆమె తొలిసారిగా పెద్దల సభకు ప్రాతినిథ్యం వహించబోతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ గురువారం ఉదయం సోనియాతో రాజ్యసభ ఎంపీ గా ప్రమాణ స్వీకారం చేయించారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సోనియా పోటీ చేశారు. నిన్నటితో మన్మోహన్ పదవీకాలం ముగిసింది. రాజస్థాన్ (Rajasthan) నుంచి సోనియా పెద్దల సభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఉదయం సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. సోనియాతో పాటు రాజ్యసభకు ఎన్నికైన 12 మంది ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఉన్నారు. ఆయన ఒడిశా నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.