దసరా వేడుకల్లో స్పీకర్ పోచారం
![దసరా వేడుకల్లో స్పీకర్ పోచారం](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_6536667a2e684.jpg)
బాన్సువాడ, ముద్ర : విజయ దశమి సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వగ్రామం పోచారంలోని నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి వాహన పూజ నిర్వహించారు.ఈసందర్భంగా గ్రామ ప్రజలకు, తనను కలవడానికి విచ్చేసిన వారందరికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గారు,పోచారం సురేందర్ రెడ్డి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం దసరా రోజున పోచారం కుటుంబ సభ్యులు ఆనవాయితిగా జరుపుకునే ఆంజనేయ స్వామి గుడి నుండి జెండా తీసుకువెళ్ళి సభాపతి ఇంటి వద్ద ఉన్న మహబూబ్ సుభాని దర్గా వద్ద జెండా ఎగురవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం బాన్సువాడ పట్టణ కేంద్రంలోని టీచర్స్ కాలనీలో శ్రీ నవ దుర్గ దేవి సేవ సమితి ఏర్పాటు చేసినటువంటి దుర్గ భవాని అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమాలలో బాన్సువాడ పట్టణ మరియు మండల నాయకులు, ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.