క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి

క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి

కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి.

కోదాడ, ముద్ర:విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని స్థానిక సీసీ రెడ్డి పాఠశాలలో కోదాడ బాస్కెట్ బాల్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఓపెన్ టు ఆల్ బాస్కెట్ బాల్ పోటీలను ముఖ్యఅతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి ఉన్నత విద్యా, ఉద్యోగాల్లో క్రీడ కోటాలో రిజర్వేషన్స్ తో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు అన్నారు. క్రీడలతో ఐక్యత,స్నేహభావం కలుగుతుందన్నారు. క్రీడాకారులకు, క్రీడారంగాని ప్రోత్సహించేందుకు ఎల్లవేళలా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలోపిసిసి రాష్ట్ర కార్యదర్శిచింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు,కౌన్సిలర్లు షాబుద్దీన్, కర్రి సుబ్బారావు,నాయకులు కంబల ప్రసాద్, బాబా,క్లబ్ అధ్యక్షులు లాం దేవరాజ్, సెక్రటరీ అర్జున్,ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ వినయ్,సాయి, ప్రభాస్, విజయ్, హేమంత్ సాయి తదితరులు పాల్గొన్నారు..