బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థిని ఆత్మహత్య

బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థిని ఆత్మహత్య
  • వ్యక్తిగత సమస్యలే కారణం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో పి యూ సి మొదటి సంవత్సరం చదువుతున్న  తెనుగు శిరీష గురువారం రాత్రి హాస్టల్ లో ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు మెదక్ జిల్లా దవ్వూరు గ్రామవాసి. మృతురాలి తండ్రి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమ బంధువుల వివాహం నిమిత్తం స్వగ్రామానికి వెళ్లిన శిరీష వారం రోజుల అనంతరం గురువారం ఉదయమే  హాస్టల్ కు చేరుకుంది. కాగా ఆత్మహత్యకు ముందు తండ్రితో కూడా ఫోన్ లో మాట్లాడింది.

అయితే మిగతా విద్యార్థినులు స్టడీ అవర్స్ కు వెళ్ళినా మృతురాలు తన గదిలోనే ఉండిపోయింది. తిరిగి వచ్చి చూసే సరికి గదిలో ఉరి వేసుకుని ఉంది. దీంతో తోటి విద్యార్థినులు అధికారులకు సమాచారం అందించడంతో, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆలోపే ఆమె మృతి చెందింది. వెంటనే మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వాసుపత్రి కి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆమె గదిలో పోలీసులు లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆమె బావ నెల రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడని, ఒకపక్క విడిచి ఉండలేక, చదువుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు లేఖ ద్వారా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.