బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది తరచూ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న యాజమాన్యం స్పందించని తీరు విమర్శలకు తావిస్తోంది తాజాగా సోమవారం రాత్రి అరవింద్ అనే పియుసి రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరవింద్ హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు గుర్తించారు వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రధానాసుపత్రికి తరలించారు. మృతుడి స్వస్థలం సిద్దిపేట జిల్లా బండారుపల్లిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.