రాష్ట్ర స్థాయి సాప్ట్ బాల్ పోటీలకి ఎంపికయిన జ్యోతి స్కూల్ విద్యార్థులు 

రాష్ట్ర స్థాయి సాప్ట్ బాల్ పోటీలకి ఎంపికయిన జ్యోతి స్కూల్ విద్యార్థులు 


ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణం లోని జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ కి చెందిన  విద్యార్థులు  రాష్ట్ర స్థాయి సాప్ట్ బాల్ పోటీలకి ఎంపికయినట్లు పాఠశాల డైరెక్టర్ బియ్యల హారి చరణ్ రావు తెలిపారు. పాటశాలకు చెందిన విద్యార్థులు మారుతి, రెహమతుల్లా , విగ్నేష్ , నిక్షిత్ , సాత్విక్ లు  ఈ నెల 13 న భీమారం మండలంలోని జడ్పీహెచ్ఎస్ గోవిందారంలో  నిర్వహించిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ లెవెల్ సాప్ట్ బాల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనభరచి ఈ నెల 22నుంచి నల్గొండ జిల్లా ఆలేరు లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సాప్ట్ బాల్ పోటీలకి ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్లు బియ్యాల హారి చరణ్ రావు, శ్రీధర్ రావు, మౌనిక రావు, అజిత , రజిత ఉపాధ్యాయులు అభినందించారు