ఇంటర్ ఫలితాలపై విద్యార్థులు ఎలాంటి ఆందోళన చందవద్దు

ఇంటర్ ఫలితాలపై విద్యార్థులు ఎలాంటి ఆందోళన చందవద్దు

హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.
హుజూర్ నగర్, ముద్ర: ఇంటర్ ఫలితాలు ఎలాంటివి వచ్చిన విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ విద్యార్థులకు ఎంతో భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల  అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల్లో గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలని అన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంటుందని సూచించారు. పరీక్షలు ఫెయిల్ అయినంత మాత్రాన అధైర్య పడవద్దు అని అన్నారు. భవిష్యత్తులో ఎన్నైనా విజయాలు సాధించాలంటే పట్టుదలతో ఉండాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు.