విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:పర్యావరణాన్ని పరిరక్షించకపోతే భవిష్యత్తు ప్రమాదకరం అవుతుందని, విద్యార్థులు ఇందుకోసం సమాజాన్ని చైతన్య వంతం చేయాలని సామాజిక సేవా సంస్థ ఈ శ్రీ గ్రీన్ వర్క్స్ కో ఆర్డినేటర్ శరత్ చంద్ర సూచించారు. నిర్మల్ లోని జ్యోతి బా ఫూలే బిసి బాలికల రెసిడెన్షియల్ పాఠశాల లో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన శిబిరంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో చర్చించి వారికి పర్యావరణ రక్షణ పట్ల అవగాహన కల్పించాలన్నారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే విపత్తులను వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మోహన్, ఎం ఆర్ ఎఫ్ పర్యవేక్షకులు మంజూష, విద్యార్థినులు పాల్గొన్నారు .