విజయవంతంగా ముగిసిన ‘వన్’ క్రికెట్ లీగ్

విజయవంతంగా ముగిసిన ‘వన్’ క్రికెట్ లీగ్

ముద్ర, మల్యాల : మండలంలోని కొండగట్టు మారుతి టౌన్ షిప్ లో కరీంనగర్ లోని వన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి, నిర్వాహకులు వెల్మ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ లీగ్ విజయవంతంగా ముగిసింది. ఈ లీగ్ లో సోమవారం ఫైనల్ మ్యాచ్ జరగగా ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథులుగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. టోర్నీలో ఫైనల్‌కు చేరిన ఇరు జట్ల సభ్యులను అభినందించి, విజేతలకు అవార్డులను అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 56 టీమ్ లు పాల్గొన్న ఈ టోర్నమెంట్ లో చొప్పదండి నియోజకవర్గంలోని ముత్యంపేట గ్రామం విన్నర్ కప్ గా, గంగాధర గ్రామం రన్నర్ కప్ గెలవడం సంతోషకర విషయం అని యువత క్రికెట్ లోనే కాకుండా అన్ని క్రీడల్లో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దారం ఆది రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సతీష్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, ముత్యం శంకర్, వోల్లాల మల్లేశం, మనోజ్, క్రీడాకారులు తదితరులు ఉన్నారు.