సీఎంను కలిసిన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ సుధాకర్ రావు

సీఎంను కలిసిన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ సుధాకర్ రావు

ముద్ర, తెలంగాణ బ్యూరో :  సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో ఆదివారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ సుధాకర్ రావు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్  ఆశీర్వాదం తీసుకున్నారు. ఇటీవల ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చైర్మన్ గా ఆయన నియమితులైన విషయం తెలిసిందే. తనకు చైర్మన్ గా  అవకాశం ఇవ్వడం పట్ల సీఎం కి కృతజ్ఞతలు తెలిపారు.  సుధాకర్ రావు వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,  ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రెడ్యానాయక్  ఉన్నారు.