కలెక్టరేట్ లో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం

కలెక్టరేట్ లో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు ప్రయత్నించడం సోమవారం కలకలం రేపింది. మునగాలకు చెందిన పిడమర్తి వెంకన్న, ఎలిశమ్మ ల కుమారుడు చిరంజీవి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తూ గత రెండు సంవత్సరాల క్రితమే చనిపోయాడు. దీంతో కోడలు రజినీకి సీనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది.


కొడుకు చనిపోవడంతో కోడలికి కొడుకు ఉద్యోగం వచ్చినప్పటికీ అత్తమామలను పట్టించుకోకపోవడంతో వారు మనస్థాపన చెందారు. సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమానికి వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఉద్యోగం వచ్చాక కోడలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేందుకు యత్నం చేశారు. ఈ విషయాన్ని అక్కడున్న పోలీసులు గమనించి అడ్డుకున్నారు.