సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. జీవో 115పై హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. విశాఖకు చెందిన వ్యాపారి కాట్రగడ్డ లలితేశ్​ కుమార్ కు మర్రిపాలెంలో కేటాయించిన 17, 135 చ.మీ. భూమిని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం జీవో 115 జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని లలితేశ్​ కుమార్​ హైకోర్టులో సవాల్​ చేశారు. జీవో 115 ను కొట్టవేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్​ చేసింది. ఏపీ ప్రభుత్వ అప్పీలును సుప్రీం కోర్టు కొట్టేసింది.