సూర్యాపేట మున్సిపాలిటీ అవిశ్వాసానికి రంగం సిద్ధం...
- అవిశ్వాసానికి కలెక్టర్కు నోటీసులు ఇచ్చిన కౌన్సిలర్లు
ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ ల పై పై అవిశ్వాసానికి కౌన్సిలర్లు బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్కు అవిశ్వాసానికి సంబంధించిన నోటీసులు అందజేశారు. దీంతో సూర్యాపేటలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి.
చైర్మన్ రేస్ లో కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి ఉంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే వైస్ చైర్మన్ రేసులో కక్కిరేణి శ్రీనివాస్ ఉంటారని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లపై అవిశ్వాసానికి నోటీసులు అందజేయడంతో సూర్యాపేట రాజకీయ రంగం ఒకసారిగా రసకందాయంలో పడింది. ఎప్పుడు ఏమి జరుగుతుందో,ఎలా ఉంటుందో నన్న ఉత్కంఠ పరిస్థితులు సూర్యాపేటలో నెలకొన్నాయి.
హైదరాబాద్ వేదికగా వేగంగా పరిణామాలు గంట గంటకు మారుతున్నాయి.
చైర్మన్ ,వైస్ చైర్మన్ పై ఆవిశ్వాసానికి మద్దతుగా 36 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసినట్టుగా సమాచారం.
ప్రస్తుతం సూర్యాపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఈ విధంగా ఉన్నారు.
కాంగ్రెస్ :-1,8,10,11,21,37,41,4448
(total 9)
తెరాస(బి.ఆర్.ఎస్)
2,3,4,5,7,9,12,15,17,18,19,22,23,24,25,26,27,28,29,31,32,33,34,35,36,38,39,40,42,43,
Total(30)
బి.ఎస్.పి:- 6,13,20,45 Total (4)
బి.జె.పి:- 14,16,30,46 total (4)
(ఖాళీ :-47ఎన్నిక జరగాలి )