ఈత సరదా విషాదం కాకూడదు  జిల్లా ఎస్పి  రక్షిత కే మూర్తి

ఈత సరదా విషాదం కాకూడదు  జిల్లా ఎస్పి  రక్షిత కే మూర్తి

 తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాల వెళ్లకుండా జాగ్రత్త లు తీసుకోవాలి
 జలాశయాల వద్ద హెచ్చరిక  సూచికలు ఏర్పాటు చేయాలి  
 ముద్ర ప్రతినిధి,  వనపర్తి : వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో ఎంతో మంది పిల్లలు యువకులు ఎండ  వేడి నుంచి సేద తీరటానికి, ఈత నేర్చుకోవడానికి   జలాశయాల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉన్నందున ఇట్టి క్రమంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణ నష్టం జరుగుతుండటం వలన తగు జాగ్రత్తలు తీసుకోవాలని,  ఈత సరదా విషాదం కాకూడదు వనపర్తి జిల్లా ఎస్పీ  శ్రీమతి రక్షిత కే మూర్తి  సూచించారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని,  ఈత ను నేర్చుకునే వారు వారి తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యముగా తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాల వద్దకు చెరువుల వద్దకు కాలువల వద్దకు కుంటలు వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధుల జలాశయాల వద్ద హెచ్చరిక  సూచికలను ఏర్పాటు చేసి  రానున్న కాలంలో ఎటువంటి ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.