టీడీపీ అభ్యర్థి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఘ‌న విజ‌యం...

టీడీపీ అభ్యర్థి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఘ‌న విజ‌యం...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు విజ‌యం సాధించారు. స‌మీప ప్ర‌త్య‌ర్థి, వైసీపీ అభ్య‌ర్థి వెంక‌ట ల‌క్ష్మీ న‌ర‌సింహ‌రాజుపై 56,777 ఓట్ల భారీ మెజారిటీతో విజ‌య‌దుందుభి మోగించారు. ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థికి 60,125 ఓట్లు రాగా, ఆర్ఆర్ఆర్‌కు 1,16,902 ఓట్లు వ‌చ్చాయి.