కడపలో టీడీపీ అభ్యర్థి రెడ్డప్పగారి మాధవిరెడ్డి గెలుపు...
![కడపలో టీడీపీ అభ్యర్థి రెడ్డప్పగారి మాధవిరెడ్డి గెలుపు...](https://mudranews.in/uploads/images/2024/06/image_750x_665ef4c583e33.jpg)
ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ కంచుకోట కడప జిల్లాలో టీడీపీ జెండా ఎగిరింది. కడప అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన రెడ్డప్పగారి మాధవిరెడ్డి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై గెలుపొందారు. ప్రస్తుతం ఆమె 5 వేలకు పైచిలుకు ఆధిక్యంలో ఉండగా.. సాయంత్రానికి పూర్తి మెజారిటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.