నర్సీపట్నంలో టీడీపీ అభ్య‌ర్థి అయ్య‌న్న పాత్రుడు గెలుపు...

నర్సీపట్నంలో టీడీపీ అభ్య‌ర్థి అయ్య‌న్న పాత్రుడు గెలుపు...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఒకే పార్టీ, ఒకే నియోజకవర్గం నుంచి పదో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు మొత్తం 19 రౌండ్ లలో జరుగుతున్నది.రెండు రౌండ్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. 17 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టిడిపి అభ్యర్థి అయ్యన్నపాత్రుడు, తన సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పై 21,597 ఓట్ల తో విజయకేతనo ఎగురవేశారు.