రాష్ట్రంలో వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో పదిమంది మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి

రాష్ట్రంలో వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో పదిమంది మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి

అమరావతి :- రాష్ట్రంలో వేరువేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పదిమంది మృతి చెందడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా ఎం.కొంగవరం, కృష్ణాజిల్లా కోడూరుపాడు, కాకినాడ జిల్లా రాయవరం వద్ద జరిగిన ప్రమాదాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గాయపడ్డ వారికి  మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.