ఈనెల 20న తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో టి యు డబ్ల్యూ జే  ఐజేయు సూర్యాపేట జిల్లా సర్వసభ్య సమావేశం

ఈనెల 20న తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో టి యు డబ్ల్యూ జే  ఐజేయు సూర్యాపేట జిల్లా సర్వసభ్య సమావేశం
  • జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలి రావాలి
  • టీయూడబ్ల్యూజేఐజేయు నాయకుల  పిలుపు


తుంగతుర్తి ముద్ర:-ఫిబ్రవరి 20న తుంగతుర్తి లోని సిరి ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటలకు జరిగే సూర్యాపేట జిల్లా టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా సర్వసభ్య సమావేశానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు తరలిరావాలని టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శంకరమంచి రవీందర్ శర్మ తుంగతుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పూసపెల్లి యాదగిరి కోదాటి విక్రం రావులు అన్నారు.

సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులునలమాధ ఉత్తంకుమార్ రెడ్డిరాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరవుతారని అన్నారుఅలాగే టి యు డబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడిన విరహత్ అలీ  ఐజేయు జాతీయ నాయకులు కొంజేటి సత్యనారాయణలతోపాటు సూర్యాపేట జిల్లాలోని శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారుసూర్యాపేట జిల్లా జర్నలిస్టులు సకాలంలో సమావేశానికి హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో తుంగతుర్తి మండల శాఖ జర్నలిస్టులు వర్దేల్లి వీరమల్లు తాళ్లపల్లి సోమన్న ఎండి నజీరుద్దీన్ ఎల్లబోయిన రాజేంద్రప్రసాద్ బింగి వెంకటేశ్వర్లు గోపగాని లింగమూర్తి భూపతి సైదులు గుండగానీ సూర్యలు పాల్గొన్నారు./