ఈనెల 20న టి యు డబ్ల్యూ జే  ఐజేయు సూర్యాపేట జిల్లా సర్వసభ్య సమావేశం

ఈనెల 20న టి యు డబ్ల్యూ జే  ఐజేయు సూర్యాపేట జిల్లా సర్వసభ్య సమావేశం
  • జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలి రావాలి
  • టీయూడబ్ల్యూజేఐజేయు నాయకుల  పిలుపు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:- ఫిబ్రవరి 20న తుంగతుర్తి లోని సిరి ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటలకు జరిగే సూర్యాపేట జిల్లా టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా సర్వసభ్య సమావేశానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు తరలిరావాలని టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు, సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోల నాగేశ్వరరావు, డాక్టర్ బంటు కృష్ణ, జాతీయ కౌన్సిల్ సభ్యులు మిక్కిలినేని శ్రీనివాసరావు, ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గింజల అప్పిరెడ్డి,శంకరమంచి రవీందర్ శర్మ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శి బత్తుల మల్లికార్జున్, రెబ్బ విజయ కుమార్,  జర్నలిస్టులపై దాడుల నిరోధక కమిటీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాదే రాము,కోదాటి విక్రమరావు లు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. జర్నలిస్టుల హక్కుల కోసం టి యు డబ్ల్యూజే ఐజేయు అహర్నిశలు కృషి చేస్తుందని వారు వివరించారు. రాష్ట్ర మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక కాబడిన విరహత్ అలీ,ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు కొణిజేటి సత్యనారాయణ, సూర్యాపేట జిల్లాలోని శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని వారు పేర్కొన్నారు. జర్నలిస్టులు కూడా సకాలంలో సమావేశానికి హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు.