తుంగతుర్తిలో జరిగే టియుడబ్ల్యూజే-ఐ జే యు జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి .

తుంగతుర్తిలో జరిగే టియుడబ్ల్యూజే-ఐ జే యు జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి .

తుంగతుర్తి ,ముద్ర:- తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో 20వ తేదీ మంగళవారం నిర్వహించే సూర్యాపేట టీయూడబ్ల్యూజే ఐజేయు జర్నలిస్టుల జిల్లా సర్వసభ్య సమావేశాన్నిఫంక్షన్ విజయవంతం చేయాలని   టీయూడబ్ల్యూజే-ఐజేయు . రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు. జిల్లా కార్యదర్శి. బంటు కృష్ణ కోరారు జిల్లా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శంకరమంచి రవీందర్ శర్మలు కోరారు.

సోమవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో వారు మాట్లాడుతూ  ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరవుతున్నారని  అలాగే టి యు డబ్ల్యూ జే-ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ జాతీయ నాయకులు కొంజేటి సత్యనారాయణ తో పాటు స్థానిక శాసనసభ్యులు మందుల సామేలు ,మాజీ మంత్రులు  రామిరెడ్డి దామోదర్ రెడ్డినాతోపాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. సమావేశంలో ప్రస్తుతం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కావున జిల్లా జర్నలిస్టులు అత్యధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో   మండల శాఖ జర్నలిస్టులు వర్ధిల్లు వీరమల్లు.  పూసపెల్లి యాదగిరి. కోదాటి విక్రమ్. . లింగమూర్తి. భూపతి సైదులు. ఎండి నజీర్ తదితరులు పాల్గొన్నారు.