ఏసీబీ వలలో తహశీల్దారు, డిప్యూటీ తహశీల్దారు

ఏసీబీ వలలో తహశీల్దారు, డిప్యూటీ తహశీల్దారు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కడెం మండల తహశీల్దార్, ఉప తహశీల్దార్ లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణ మూర్తి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. తహశీల్దారు రాజేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్ చిన్నయ్యలు ఈ దాడుల్లో పట్టుబడ్డారు. మద్దిపడగ కు చెందిన రాజన్నకు సంబంధించిన భూమి రిజిస్ట్రేషన్ విషయంలో వీరు రూ.15వేలు డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ చిన్నయ్య ద్వారా రూ. 9వేలు లంచం స్వీకరిస్తున్న సమయంలో దాడి చేసి పట్టుకున్నారు.