మంచిర్యాలలో తెలంగాణ దశాబ్ది మహిళా దినోత్సవం

మంచిర్యాలలో తెలంగాణ దశాబ్ది మహిళా దినోత్సవం

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసి వారి ఆర్ధిక పురోభివృద్ధి కి పాటుపడుతోందని కలెక్టర్ సంతోష్ అన్నారు. మంగళవారం ఎఫ్ సీఏ ఫంక్షన్ హల్ లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు సందర్భంగా మహిళా దినోత్సవం ను నిర్వహించారు. ఈ కార్యక్రమంకు కలెక్టర్, ఎమ్మెల్యే దివాకర్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వం మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం కళ్యాణాలక్ష్మి, షాధిముబారఖ్ పథకాలను ప్రవేశపెట్టి వివాహాలకు చేయూత ఇచ్చిందని కొనియాడారు.