తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డి రాజేశ్వర్ రావు ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డి రాజేశ్వర్ రావు ప్రమాణ స్వీకారం
  • శుభాకాంక్షలు తెలిపిన బిషప్ దుర్గం ప్రభాకర్ 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-హైదరాబాద్,నాంపల్లి, గృహకల్ప బిల్డింగ్ 2 వ అంతస్తులో తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణస్వీకార మహోత్సవం లో తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ నాయకులు, సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ చైర్మన్ డి రాజేశ్వర్ రావు కు మొక్క ను అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర క్రైస్తవనాయకులు,ఆత్మీయులు, తెలంగాణ రాష్ట్ర మాజీ క్రిస్టియన్ ఎమ్మెల్సీ,డి. రాజేశ్వర్ రావు గతం లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్ట మొదటి హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా, మూడు సార్లు ఎంమ్మెల్సీ గా రాష్ట్ర ప్రజల కు సేవలందించిగా, వారి సేవలను గుర్తించి మన తెలంగాణ రాష్ట్ర ప్రియతమ  ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత మొట్ట మొదటి "తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా డి.రాజేశ్వర రావు ను నియమించినారనీ ఈ రోజు ఆర్ధిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, యస్. సి. యస్. టి మరియు మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రోడ్లు భావన శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, పశు సంవర్ధ, మరియు సీనిటోగ్రఫీ శాఖ మంత్రి , తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ శంకర్ లుక్,అంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఎల్. వి. స్టివెన్,తెలంగాణ రాష్ట్ర మైనారిటీ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వెస్లీ ఆధ్వర్యంలో పదవీ బాధ్యతలు చేపట్టరు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రెవ.ఇరుగు సంసోన్, ట్రినీటి విద్యా సంస్థల అధినేత డా. ముల్లంగి జాకబ్ రాజు, హుజూర్నగర్ నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిప్ అధ్యక్షులు రెవ. కొత్తపల్లి ఉదయ్ బాబు, జిల్లా క్రిస్టియన్ నాయకులు పాస్టర్ ఉటుకూరి రాజు, బిషప్ మోజెస్, పాస్టర్ అపోలో తదితరులు పాల్గొన్నారు.