అభివృద్ధి, సంక్షేమం లో దేశానికి తెలంగాణ ఆదర్శం - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
![అభివృద్ధి, సంక్షేమం లో దేశానికి తెలంగాణ ఆదర్శం - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64b909f592a78.jpg)
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అభివృద్ధి, సంక్షేమం లో దేశానికి తెలంగాణ ఆదర్శమని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని శుభ మస్తు కన్వెన్షన్ లో 1వార్డు కి చెందిన పలువురు కౌన్సిలర్ కూసరి అనిల్, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడు వళ్లేపు మొగిలిల అధ్వర్యంలో బి అర్ ఎస్ పార్టీలో చేరారు. బిఆర్ ఎస్ పార్టీలో చేరిన పల్లపు కుమార్, వల్లేపు శ్రీకాంత్, శ్రీకాంత్ దావీద్ లకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, లైబ్రరీ ఛైర్మెన్ డా.చంద్ర శేకర్ గౌడ్ లు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వీరంతా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బి అర్ ఎస్ పార్టీ లో చేరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్,మాజీ మున్సిపల్ చైర్మన్ దేశాయి,పట్టణ పార్టీ నాయకులు సమిండ్ల శ్రీనివాస్,అడువల జ్యోతి,బాలే శంకర్,పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,ఉప అధ్యక్షులు ఓల్లెం మల్లేశం, దుమాల రాజ్ కుమార్, తాజ్, కత్రోజ్ గిరి, శెట్టి శ్రీనివాస్, లవంగ రాజు, పవన్, కౌన్సిలర్ ఫోరం జిల్లా అధ్యక్షులు పాంబల రామ్ కుమార్, రాష్ట్ర ఉప అధ్యక్షులు బోడ్లజగదీష్, తదితరులు పాల్గొన్నారు.