చంద్రబాబు అరెస్ట్ తో మస్కబారిన జగన్ ప్రతిష్ట

చంద్రబాబు అరెస్ట్ తో మస్కబారిన జగన్ ప్రతిష్ట
  • గరిడేపల్లి లో తెలుగు తమ్ముళ్ల నిరసన, రాస్తారోకో
  • టిడిపి నల్గొండ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి, హుజూర్నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ మండవ వెంకటేశ్వర్లు గౌడ్

ముద్ర గరిడేపల్లి:-తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేయడంతో దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ట మస్కబారిందని తెలుగుదేశం పార్టీ నల్గొండ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి, హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి మండవ వెంకటేశ్వర్లు గౌడ్ అన్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించిన అనంతరం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేయించారని చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని జగన్మోహన్ రెడ్డి ప్రజాకోర్టులో శిక్ష ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలుకుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.  జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పి జైలు నుంచి విడుదల చేయాలని  డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కీసరి నాగయ్య ముదిరాజ్, గుండు వెంకటేశ్వర్లు గౌడ్ , మఠంపల్లి మండల పార్టీ అధ్యక్షులు మాలోతు నాగు నాయక్ సిపిఎం మండల పార్టీ కార్యదర్శి షేక్ యాకోబు , మండల అధికార ప్రతినిధి మర్రి రాములు,  మైనార్టీ సెల్ జిల్లా నాయకులు ఎస్కే రంజాన్,  తెలుగు యువత మండల అధ్యక్షులు ఉపేందర్ యాదవ్, తెలుగు యువత పార్లమెంటు నాయకులు వీరయ్య యాదవ్, రైతు సంఘం నాయకులు చిక్కుళ్ళ సైదులు కీసరి సైదులు పలువురు మహిళా నాయకురాళ్ళు పాల్గొన్నారు.