వడదెబ్బతో కౌలు రైతు మృతి

వడదెబ్బతో కౌలు రైతు మృతి

ముద్ర, మల్యాల: మండల కేంద్రానికి చెందిన ఐతరవేణి రమేష్(38) అనే కౌలు రైతు ఆదివారం వడదెబ్బతో మృతి చెందాడు. వ్యవసాయ పనుల్లో భాగంగా వడదెబ్బ తగిలి గత రెండు రోజుల నుంచి రమేష్ తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులు, నీరసంతో బాధపడుతున్నాడు. ఈ రోజు ఉదయం జగిత్యాలలోని ఆసుపత్రికి తరలిస్తుండగా, మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.