కొండగట్టులో వాయిదా పడ్డ వ్యాపారాలకు టెండర్లు

కొండగట్టులో వాయిదా పడ్డ వ్యాపారాలకు టెండర్లు

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో వాయిదా పడ్డ నాలుగు వ్యాపారాలకు అధికారులు శుక్రవారం టెండర్లు నిర్వహించారు. ఏడాది కాలపరిమితితో పూలు-పండ్లు, ఫోటో స్టూడియో, మొబైల్ లాకర్, టాయిలెట్స్-మరుగుదొడ్ల నిర్వహణకు అధికారులు ఈ టెండర్, సిల్డ్ టెండర్ , బహిరంగ వేలం నిర్వహించారు. అయితే ఎప్పటి మాదిరిగానే వ్యాపారులు ఒక్కటయ్యారు..  వ్యాపారాలు దక్కించున్నారు..? దేవాదాయశాఖ ప్రత్యేక దృష్టి పెట్టనంత కాలం అంజన్న సొమ్ముకు గండి పడుతూనే ఉంటుందని పలువురు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో బుద్ది శ్రీనివాస్, సూపరిoడేoట్ సునీల్, తదితరులు పాల్గొన్నారు.