ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

ముద్ర ప్రతినిధి, నిర్మల్:రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాలను నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్     అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తో కలసి మంగళ వారం పరిశీలించారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న  ఇవిఎం ల భద్రత, రిసెప్షన్ కేంద్రం ఏర్పాటు, పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేయబోయే కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. మూడు అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులకు సూచనలు చేశారు. ఇవిఎం ల భద్రతకు గదులు, భద్రత దృష్ట్యా చేపట్టాల్సిన చర్యల గురించి పరిశీలించారు. భోజన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ ఏర్పాటు, విద్యా సంస్థల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ముందుగా ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలతో మాట్లాడి ఆయా రోజుల్లో పాఠశాలకు సెలవులు ఇచ్చేలా చూడాలన్నారు. ఇవిఎం స్ట్రాంగ్ రూమ్, అదనపు ఇవిఎం లతో సహా భద్రపర్చడానికి సరైన వసతి ఏర్పాటు చేసుకోవాలన్నారు.  కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్  కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, సంబంధిత  రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.