మంచిర్యాల లో కంటి వెలుగులో పరీక్షలు చేసుకున్న ఎమ్మెల్యే

మంచిర్యాల లో కంటి వెలుగులో పరీక్షలు చేసుకున్న ఎమ్మెల్యే
The MLA eye test in Manchiryal

మంచిర్యాల, ముద్ర, ప్రతినిధి: మంచిర్యాలలో ప్రారంభమైన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు కంటి పరీక్షలు చేసుకున్నారు. గురువారం రాజీవ్ నగర్ లోని అర్బన్ హెల్త్ సెంటర్ లో కంటి వెలుగు కార్యక్రమం వందరోజుల వైద్య శిబిరం ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం తొలి పరీక్షను ఎమ్మెల్యే చేసుకున్నారు. ఏడుపదుల వయస్సు దాటినా ఎలాంటి మేజర్ దృష్టి లోపం లేదని వైద్యులు తెలిపారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు కంటి వెలుగు కేంద్రంలో కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కంటి అద్దాల తో పాటు మందులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుబ్బారాయుడు, ఆ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బుద్ధర్తి సత్తమ్మ రామ్ చందర్,  వైద్యులు, మున్సిపల్ కౌన్సిలర్ లు, బీఆరేఎస్ నేతలు పాల్గొన్నారు.