తెలంగాణ పెండింగ్ బిల్లుల పిటిషన్ను స్వీకరించిన సుప్రీం
![తెలంగాణ పెండింగ్ బిల్లుల పిటిషన్ను స్వీకరించిన సుప్రీం](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_641999fc38efb.jpg)
తెలంగాణ పెండింగ్ బిల్లుల పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది.
రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి సంబంధించిన కీలక బిల్లులను ఆమోదించకపోవడంపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇదే వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు మధ్య పంచాయితీ కొనసాగుతోంది. తాజాగా, ఈ అంశంలో గవర్నర్కు నోటీసులిచ్చేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం.. కేంద్రానికి నోటీసులిచ్చింది.