సంపూర్ణ అందత్వ నిర్మూలనే కంటి వెలుగు లక్ష్యం.

సంపూర్ణ అందత్వ నిర్మూలనే కంటి వెలుగు లక్ష్యం.

   ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.

 హుజూర్ నగర్, ముద్ర:తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ  అందత్వ నిర్మూలనే లక్ష్యంగా కెసిఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి  అన్నారు. హుజూర్నగర్ 26 వార్డులో కంటి వెలుగు శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవికుమార్ తో కలిసి ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని, ఊరూరా పల్లె పట్నం అనే తేడా లేకుండా కంటి వెలుగు శిబిరాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, క్యాంప్ ఇంచార్జ్ ఇందిరాల రామకృష్ణ డాక్టర్ సుష్మ, మల్లిక ,శివ,స్థానిక కౌన్సిలర్లు గాయత్రి భాస్కర్, కొమ్ము శ్రీనివాస్, నాగు, నరేష్, కొండేటి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.