అత్తను కాల్చి చంపిన  కానిస్టేబుల్‌

అత్తను కాల్చి చంపిన  కానిస్టేబుల్‌
  • అత్త కమలమ్మ అక్కడిక్కడే మృతి
  • కానిస్టేబుల్ ప్రసాద్ పై అత్త కుటుంబీకులు దాడి
  • తీవ్ర గాయాలతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ప్రసాద్
    వరంగల్​ జిల్లా గండ్ల సింగారంలో ఘటన

ముద్ర, తెలంగాణ బ్యూరో :  కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్‌ అత్తను కాల్చి చంపాడు. హన్మకొండ జిల్లా గుండ్ల సింగారంలో ఈ ఘటన జరిగింది. ప్రసాద్ అనే కానిస్టేబుల్ రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా డబ్బుల విషయంలో అత్తా కమలమ్మ అల్లుడు ప్రసాద్ మధ్య వివాదం నడుస్తోన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రసాద్ భార్యతో కలిసి గండ్లసింగారం గ్రామానికి వచ్చాడు. డబ్బుల విషయంలో మరోసారి అత్తా అల్లుడి మధ్య మాటామాట పెరిగడంతో కోపోద్రిక్తుడైన ప్రసాద్ తన వద్దనున్న గన్ తో అత్తపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో కమలమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. కాల్పులు జరిపిన ప్రసాద్ పై కమలమ్మ కుటుంబ సభ్యులు దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కానిస్టేబుల్ ప్రసాద్ ను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.