ఎందరో త్యాగం వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చింది

ఎందరో త్యాగం వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చింది

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : ఎంతో మంది త్యాగ  నిస్వార్థ పోరాటం వల్ల దేశానికి తెల్లదొరల నుంచి విముక్తి కలిగి స్వాతంత్రం సిద్దించిందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా సుమన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈసందర్భంగా అనంతరం సుమన్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల పోరాట స్ఫూర్తి తోనే తెలంగాణ ఉద్యమం చేశామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఉద్యుత్ సరఫరాలో రాష్ట్రం  ఉత్తమంగా నిలిచామని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని గ్రామాలు సైతం అభివృద్ధి సాధించడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను, ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ సంతోష్ బాణవత్, జిల్లా పరిషత్ చైర్మన్ భాగ్యలక్ష్మి, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపెళ్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, డీసీపీ సుధీర్,  అధికారులు పాల్గొన్నారు.