మత కుల విద్వేషాలు రగల్చడమే ప్రతిపక్షాల పిచ్చి

మత కుల విద్వేషాలు రగల్చడమే ప్రతిపక్షాల పిచ్చి

 ముస్లింల సంక్షేమంలో దేశంలోనే కెసిఆర్ ఆదర్శం
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: ప్రతిపక్షాలు మత,కుల విద్వేషాలురెచ్చగొట్టారు తప్ప ముస్లింల సంక్షేమానికి పాటుపడలేదని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక రూబీ గార్డెన్ లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న దేశంలో రాష్ట్రంలో ముస్లింలు వెనుకబాటు తనానికి గురయ్యారు అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పిస్తూ అన్ని వర్గాలను అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నారన్నారు.

ముఖ్యంగా అన్ని కుల మతాలలోని నిరుపేదల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం కోసం దేశంలోని ఏ రాష్ట్రంలో బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం అన్ని నిధులు కేటాయించ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసిఆర్ సమర్థ పాలనతో ముందుకు పోతుంది అన్నారు. ముస్లింలు కేసీఆర్ కు అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ముస్లిం అడ్వైజరి కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ హాబిబ్ ఖాన్, ఉపాధ్యక్షులు యాకూబ్ బాబాజీర్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు మస్తాక్ అహ్మద్,జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు షేక్ ఫరీద్ అహ్మద్, ముస్లిం సంఘాల బాధ్యులు,మస్జీద్ కమిటీ ల బాధ్యులు మహమ్మద్ జైనుల అబిదిన్, సయ్యద్ రఫీ యొద్దిన్, అబ్దుల్లా ఖాన్,జామా మస్జిద్ ఇమామ్ అబ్దుల్ హఖ్,  మున్సిపల్ కౌన్సిలర్లు మహమ్మద్ ఖాజా ఖాన్, ఇషాహక్ మియ్యా, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ హమీద్ ఖాన్, ప్రజా ప్రతినిధులు,బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముస్లిం సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు.